తమిళనాడులో అధికార పార్టీ అయిన డీఎంకే,కేంద్రంలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ పార్టీకి చెందిన నేతల మధ్య వారసత్వ రాజకీయాలపై మాటల యుద్ధం కొనసాగుతోంది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం, నీట్ ను వ్యతిరేకించడంపై ‘చదువురాని వాళ్లు రాష్ట్రాన్ని పాలిస్తే ఇలాగే ఉంటుంది’ అని సీఎం.. డీఎంకే అధినేత స్టాలిన్ పై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. దీంతో ‘అసలు జైషా ఎవరు? ఎన్ని సెంచరీలు కొట్టాడు’ అని డీఎంకే నేతలు కౌంటర్ ఇస్తున్నారు.
