Home / ANDHRAPRADESH / గుడ్‌న్యూస్.. పెరిగిన రైళ్ల స్పీడ్..!

గుడ్‌న్యూస్.. పెరిగిన రైళ్ల స్పీడ్..!

ట్రైన్ జర్నీ చేసే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వేస్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై సౌత్ సెంట్రల్ జోన్‌లో పరిధిలో రైళ్లు దూసుకుపోనున్నాయి. ట్రైన్స్‌కు సంబంధించిన వేగాన్ని పెంచినట్లు వెల్లడించింది ద.మ రైల్వేస్. నేటి(సోమవారం) నుంచే ఈ స్పీడ్ అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం గంటకు 110 కి.మీ వెళ్తున్న ట్రైన్లు ఇకపై గంటకు 130 కి.మీ వెళ్లనున్నాయి. సికింద్రాబాద్, విజయవాడ, గుంతకల్ డివిజన్లలోని ఈ వేగం పెరుగుతుంది.

– విజయవాడ డివిజన్ పరిధి కొండపల్లి-గూడూరు, గుంతకల్ డివిజన్‌లోని రేణిగుంట-గుంతకల్ సెక్షన్లలో ట్రైన్ల రద్దీ ఎక్కువగా ఉండటంతో.. రైల్వే ట్రాక్‌ల సామర్థ్యాన్ని పెంచి రైళ్లను వేగవంతం చేయాలని 2020లో నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇటీవల ట్రాక్‌ల సామర్థ్యాన్ని పెంచారు.

– సికింద్రాబాద్‌ డివిజన్‌లోని సికింద్రాబాద్‌-కాజీపేట-బల్లార్ష, కాజీపేట-కొండపల్లి.. విజయవాడ డివిజన్‌ పరిధిలోని కొండపల్లి-విజయవాడ-గూడూరు.. గుంతకల్‌ పరిధిలో రేణిగుంట-గుంతకల్లు-వాడి సెక్షన్లలో గరిష్ఠ వేగం 130 కి.మీ.లకు పెంచారు. ఆయా మార్గాల్లో ఇంతకు మించిన వేగంతో రైళ్లు పరుగులు తీసినా తట్టుకునేలా ట్రాక్‌లను పటిష్ఠం చేశారు.

– రైళ్ల వేగం పెంచినట్లు పలు సెక్షన్లలో ప్రకటించినప్పటికీ ఆధునిక ఎల్‌హెచ్‌బీ బోగీలున్న ట్రైన్‌లే ఈ స్పీడ్‌తో వెళ్లనున్నాయి. పాతతరం ఐసీఎఫ్‌ కోచ్‌ల సామర్థ్యం గంటకు 110 కి.మీనే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat