తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్రసమితికి చెందిన… స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, తాను రెండు కళ్ల లాంటి వాళ్లమని అన్నారు.
అయితే… ఒకేవైపు చూస్తే, మరో కన్ను పోతుందని అన్నారు. ఇక కడియం ఎమ్మెల్సీగా ఎన్నికై కేవలం ఆరు నెలలే అవుతుందని చెప్పారు. ఇద్దరి మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా రాజయ్య వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.