దీపావళి వస్తుందంటే చాలు.. చిన్నా పెద్దా అంతా ఏకమై టపాసుల మేత మోగిస్తారు. వీధి వీధులంతా రంగులమయం కావాల్సిందే.. కానీ ఈసారి ఎక్కడా క్రేకర్స్ సౌండ్ వినిపించకూడదని దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి నాడు టపాసులను పూర్తిగా బ్యాన్ చేసింది. దేశ రాజధానిలో వాయు కాలుష్యం నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు దిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్.
ఈనెల 28 నుంచి ప్రారంభం కానున్న ఈ ఆంక్షలు జనవరి 1, 2023 వరకు అమల్లో ఉంటాయని బుధవారం ఆయన వెల్లడించారు. టపాసుల బ్యాన్ను కఠినంగా అమలు చేసేందుకు త్వరలో కార్యాచరణను రూపొందించనున్నట్లు చెప్పారు. అన్ని రకాల టపాసుల ఉత్పత్తి, నిల్వ, క్రయ విక్రయాలు, వినియోగం పూర్తిగా నిషేధిస్తున్నట్లు స్ఫష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి టపాసులు కాల్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.