Home / SLIDER / మునుగోడు ఉప ఎన్నికలు-సీపీఎం సంచలన నిర్ణయం

మునుగోడు ఉప ఎన్నికలు-సీపీఎం సంచలన నిర్ణయం

  తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న  మునుగోడు  అసెంబ్లీ నియోజకవర్గ  ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని అధికార పార్టీ అయిన  టీఆర్‌ఎస్   పార్టీకి సీపీఎం   మద్దతు ప్రకటించింది. ఈ రోజు గురువారం ఉదయం  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం  మీడియాతో మాట్లాడుతూ… మునుగోడు  లో తమకే సపోర్ట్ చేయాలని అన్ని పార్టీలు కోరాయని తెలిపారు.

అయితే బీజేపీ  ని ఓడగొట్టడానికి టీఆర్ఎస్‌కు మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నామన్నారు. అభివృద్ది కోసమే రాజీనామా చేశానని రాజగోపాల్  చెప్పడం కేవలం సాకు మాత్రమే అని విమర్శించారు. రాజగోపాల్ ఎందుకు రాజీనామా చేశాడో కేంద్ర హోం మంత్రి అమిత్ షా   క్లియర్‌గా చెప్పారని అన్నారు.

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్‌గా ఉండబోతోందని… దీన్ని బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్‌గా మార్చబోతున్నారని తెలిపారు. మునుగోడులో కాంగ్రెస్   పార్టీకి బలమున్నా మూడో స్థానానికి పోతుందని అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat