కాంగ్రెస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి.. తాజాగా ఆ పార్టీకి చెందిన అత్యంత సీనియర్ నేత.. ముఖ్యమంత్రిగా పని చేసిన అత్యంత అనుభవం ఉన్న గులాంనబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పారు. ఆయన ఈరోజు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
జమ్మూకశ్మీర్ రాష్ట్ర మాజీ సీఎం ఆజాద్.. పార్టీకి చెందిన అన్ని పోస్టుల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అయిదు పేజీల లేఖను ఆయన రాశారు. పార్టీలో సంప్రదింపుల ప్రక్రియ లేకుండాపోయిందని ఆజాద్ ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ వైస్ ప్రెసిడెంట్ అయ్యాక పార్టీ నాశనమైనట్లు ఆయన తెలిపారు.