రాష్ర్టంలో నిర్వహించిన భారత స్వతంత్ర వజ్రోత్సవాలు ఈ రోజుతో పూర్తికానున్నాయి. ఇందుకు సంబంధించిన ముగింపు సభను సిటీలోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ఆ రూట్లో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. ఇందుకు వాహనదారులు ఆల్టర్నేట్ రూట్స్లో వెళ్లాలని పోలీసులు తెలిపారు.
ఏ ఏరియాల్లో అంటే..
– బషీర్బాగ్ ఫ్లైఓవర్ నుంచి వచ్చే వాహనాలను బీజేఆర్ విగ్రహం నుంచి రైట్సైడ్ అనుమతించకుండా గన్ఫౌండ్రి ఎస్బీఐ వద్ద కుడివైపు దారిమళ్లించి చాపెల్రోడ్డు మీదుగా పంపిస్తారు.
– బషీర్బాగ్ నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్ వైపు వచ్చే వాహనాలను బషీర్బాగ్ వద్ద దారిమళ్లించి లిబర్టీ మీదుగా అనుమతిస్తారు.
– హిమాయత్నగర్ వైజంక్షన్ నుంచి బషీర్బాగ్ వైపు వచ్చే వాహనాలను హిమాయత్నగర్ వై జంక్షన్ నుంచి పంపనున్నారు.
– రవీంద్రభారతి, హిల్ ఫోర్ట్ రోడ్డు నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలను నాంపల్లి మీదుగా పంపిస్తారు.
– చాపెల్ రోడ్డు, నాంపల్లి నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి పోలీసు కంట్రోల్ రూమ్ మీదుగా అనుమతించనున్నారు.
– గన్ఫౌండ్రి ఎస్బీఐ నుంచి ప్రెస్క్లబ్, బషీర్బాగ్ ఫ్లైఓవర్ వైపు నుంచి వచ్చే వాహనాలను ఎస్బీఐ వద్ద దారి మళ్లించి, చాపెల్ రోడ్డు మీదుగా అనుమతిస్తారు.
– నారాయణగూడ సిమెట్రి నుంచి బషీర్బాగ్ వైపు వెళ్లే వాహనాలను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద దారిమళ్లించి హిమాయత్నగర్ వై జంక్షన్ మీదుగా అనుమతిస్తారు.
– కోఠి, బొగ్గులకుంట నుంచి బషీరాబాగ్, భారతీయ విద్యాభవన్ మీదుగా వెళ్లే వాహనాలను కింగ్ కోఠి క్రాస్రోడ్డు వద్ద దారి మళ్లించి తాజ్మహల్ హోటల్, ఈడెన్ గార్డెన్ మీదుగా అనుమతిస్తారు.