ఓ వ్యక్తి ఒకేసారి రెండు ఉద్యోగాలు చేశాడు. అంతే కాకండా ఆ రెండు చోట్లా రిటైర్ అయ్యాడు కూడా. కనీసం పక్కనున్న వ్యక్తికి తెలీకుండా, ఎవరకీ అనుమానం రాకుండా ఇన్నేళ్లు పని చేసిన వ్యక్తి తాజాగా పెన్షన్ కోసం వెళ్లి దొరికిపోయాడు.
హనుమకొండ జిల్లా కిషన్పురాకు చెందిన ఎస్కే సర్వర్ రెండు వేరువేరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ తీసుకొని.. ఒకదాన్ని వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో, మరొకటి పోలీసు డిపార్ట్మెంట్లో పెట్టి రెండు చోట్లా అటెండర్ ఉద్యోగాలు చేశాడు. ఇటీవల రెండు చోట్లా పదవీ విరమణ పొంది పింఛను కోసం డీటీవో ఆఫీస్కు వెళ్లి దరఖాస్తు చేసుకున్నాడు.
అతని దరఖాస్తు పరిశీలించగా అసలు విషయాన్ని జిల్లా ట్రెజరీ అధికారులు గుర్తించారు. వెంటనే డీటీవో వరంగల్ సీపీ తరుణ్జోషికి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఒకే సమయంలో రెండు చోట్ల ఎలా పనిచేశాడు అనేది విచారణలో తెలుస్తుందని పోలీసులు తెలిపారు.