హైదరాబాద్లో హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎంఎంటీఎస్ రైలు ఢీకొని ముగ్గురు మృతిచెందారు.
వివరాల్లోకి వెళితే హైటెక్సిటీ రైల్వేస్టేషన్ సమీపంలోని మూల మలుపు వద్ద ఎంఎంటీఎస్ రైలును గమనించకుండా ముగ్గురు వ్యక్తులు పట్టాలు దాటేందుకు యత్నించారు. ఈ క్రమంలో రైలు ఢీకొనడంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను వనపర్తికి చెందిన రాజప్ప, శ్రీను, కృష్ణగా గుర్తించారు. డెడ్బాడీలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.