Home / SLIDER / ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి కేటీఆర్

ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి కేటీఆర్

16వ భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ,విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్మా పోటి చేస్తున్న సంగతి విధితమే. ఈ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు దేశ వ్యాప్తంగా పోలింగ్ జరుగుతుంది. ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ప్రాంగణాల్లో మంత్రులు,ఎమ్మెల్యేలు తమ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

ఈ క్రమంలో తెలంగాణలో కూడా రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌ ఉదయం ప్రారంభమైంది. శాసనసభ కమిటీ హాలులో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో మంత్రి కేటీఆర్‌ మొదటి ఓటుహక్కు వినియోగించుకున్నారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఓటు వేస్తున్నారు.

అంతకుముందు తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మాక్‌ పోలింగ్‌కు మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అనంతరం అక్కడి నుంచి బస్సుల్లో నేరుగా అసెంబ్లీకి చేరుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. ఈ నెల 21న ఫలితాలను వెల్లడిస్తారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat