దేశంలో మళ్లీ కరోనా పాజిటీవ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 20,528 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 4,37,50,599కి చేరాయి. ఇందులో 4,30,81,441 మంది బాధితులు కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు.
ఇప్పటివరకు 5,25,709 మంది కరోనా మహమ్మారి భారీన పడి మృతిచెందారు. మరో 1,43,449 కరోనా పాజిటీవ్ కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 49 మంది కరోనాకు బలయ్యారు.. 17,790 మంది డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.