ఈ యేటి ఫెమినా మిస్ ఇండియా టైటిల్ను సిని శెట్టి గెలుచుకున్నది. కర్నాటకకు చెందిన ఈ సుందరి ఆదివారం జరిగిన వీఎల్సీసీ ఫెమినా మిస్ ఇండియా ఈవెంట్లో విన్నర్గా నిలిచింది. జియో వరల్డ్ సెంటర్లో జరిగిన వేడుకలో సిని శెట్టి తన అందాలతో మెస్మరైజ్ చేసింది. రాజస్థాన్కు చెందిన రూబల్ షేకావత్ తొలి రన్నరప్గా, యూపీకి చెందిన షినాటా చౌహాన్ సెకండ్ రన్నరప్గా నిలిచారు. ఫెమినా మిస్ ఇండియా ప్యానెల్లో నటులు నేహా దూపియా, డీనో మోరియా, మలైకా ఆరోరా, డిజైనర్లు రోహిత్ గాంధీ, రాహుల్ ఖన్నా, కొరియోగ్రాఫర్ షియామక్ దావార్, క్రికెటర్ మిథాలీ రాజ్లు ఉన్నారు.
