కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని హెచ్ఎఎల్ నార్త్ కాలనీకి చెందిన సంక్షేమ సంఘం సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో రూ.9 లక్షలతో మంచినీటి పైపులైన్లు, రూ.14 లక్షలతో భూగర్భడ్రైనేజీ పూర్తి చేయించి.. సీసీ రోడ్లకు రూ.34 లక్షలు మంజూరు చేయించి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నిధులకు కొరత లేకుండా ప్రతి కాలనీలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించి ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో పాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ప్రసాద్, జనరల్ సెక్రెటరీ సుబ్బా రాయుడు, జాయింట్ సెక్రటరీ దస్తగిరి రెడ్డి, లక్ష్మీ నారాయణ, కృష్ణ మూర్తి పాల్గొన్నారు.
