తెలంగాణ రాష్ట్రంలోని మహిళల జోలికోస్తే ఎంతిటి వారినైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు డీజీపీ, ఉమెన్ సెఫ్టీ విభాగం అధికారి స్వాతి లక్రా తేల్చిచెప్పారు. గద్వాల జిల్లా కేంద్రంలో భరోసా కేంద్రం, స్త్రీ బాలల సహాయ కేంద్రాన్ని స్వాతి లక్రా ఈ రోజు గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, గద్వాల జిల్లా జడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్య, జిల్లా కలెక్టర్ శ్రీహర్ష, పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
