కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష కొనసాగుతోంది. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆ పార్టీ అగ్రనేతలు కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్, దిగ్విజయ్ సింగ్, అధీర్ రంజన్ చౌదరి, జేడీ శీలం, సల్మాన్ ఖుర్షీద్, ఉత్తమ్, కొప్పుల రాజు, గిడుగు రుద్రరాజు తదితరులు జంతర్ మంతర్ దగ్గర దీక్షలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ అగ్నిపథ్ స్కీమ్తో దేశభద్రతకు ముప్పుని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా ఆర్మీలో కాంట్రాక్ట్ నియామక విధానం లేదని అన్నారు. నాలుగేళ్ల తర్వాత ఆ యువకుల భవిష్యత్ ఏంటని ప్రశ్నించారు.
అగ్నిపథ్తో రూ.5లక్షల కోట్ల పెన్షన్ను సేవ్ చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ స్కీమ్తో రక్షణశాఖలో 15శాతం రిక్రూట్మెంట్ ఆగిపోతుందని, పాక్, చైనా నుంచి ముంపు పెరిగే అవకాశం ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు