కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘం సభ్యులు మరియు నాయకులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా పలు సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగా స్పందించిన ఎమ్మెల్యే గారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అదే విధంగా తమ సమస్యలు పరిష్కరించినందుకు గాను ఎమ్మెల్యే గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పలు ఆహ్వాన పత్రికలు కూడా అందజేశారు.