ఐనవోలు మండలం మండలం సింగారం గ్రామానికి చెందిన జక్కుల వీరస్వామి గారు ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందారు. దింతో టిఆర్ఎస్ పార్టీ క్రియాశీల సభ్యత్వం ద్వారా మంజూరైన 2 లక్షల రూపాయల పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును వారి కుటుంబ సభ్యులైన జక్కుల శ్రీలత గారికి తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు స్వయంగా ఇంటికి వెళ్లి బాధిత కు అందజేశారు.
ఈ సందర్బంగా క్రియాశీల సభ్యత్వం ద్వారా 2లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కును అందచేసిన ఎమ్మెల్యే అరూరి రమేష్ గారికి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియచేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.