లద్దాఖ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్మీ జవాన్లు వెళ్తున్న వాహనం ఓ నదిలో పడింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు సైనికులు మరణించారు. పార్థాపూర్ క్యాంప్ నుంచి హనీఫ్ సబ్ సెక్టార్ వైపు వెళ్తుండగా టుర్టుక్ సెక్టార్ వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న ఆర్మీ సహాయక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన జవాన్లను హాస్పిటల్కు తరలించారు. 19 మంది ఆర్మీ జవాన్లు గాయపడినట్లు గుర్తించారు. వీరిలో కొందరి పరిస్థితి సీరియస్గా ఉంది. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం ఎయిర్ అంబులెన్స్లో వెస్ట్రర్న్ కమాండ్కు తరలించేందుకు ఇండియన్ ఆర్మీ చర్యలు చేపడుతుతోంది.