తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా..కీర్తి సురేష్ హీరోయిన్ గా పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కి ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ సర్కారు వారి పాట. అయితే తాజా చిత్రమైన’సర్కారు వారి పాట’ చూసేందుకు ఎవరూ రాక థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయని టీవీ9లో కార్యక్రమం ప్రసారమైంది.
బాగా హర్ట్ అయిన మహేశ్ ఫ్యాన్స్ టీవీ 9ను ట్విటర్లో ఘోరంగా ట్రోల్ చేశారు. దీంతో టీవీ9 పేరుతో ఓ హ్యాష్ ట్యాగ్ ట్విటర్ ట్రెండింగ్లోకి వచ్చింది. ఫలితంగా ముందు ప్రసారం చేసిన కార్యక్రమానికి పూర్తి భిన్నంగా.. ‘రూ.100కోట్ల క్లబ్లోకి సర్కారోడు. రిలీజైన రీసౌండిచ్చే రికార్డు’ అని టీవీ9 మరో ట్వీట్ చేసింది.