కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాయినగర్ వద్ద రంజాన్ సందర్భంగా ముస్లీం సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ముస్లీం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్, సురేష్ రెడ్డి, కోలన్ వీరేందర్ రెడ్డి, రవికిరణ్, బాలాజీ నాయక్, కోఆప్షన్ మెంబర్ సలీం, నిజాంపేట్ కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రంగారయ ప్రసాద్, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి, కాసాని విరేశ్, ఖాన్, నబీ, ఆనంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.