గత ఏడాది పార్టీలకు అందిన విరాళాల విషయంలో కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీ మరో రికార్డు నెలకొల్పింది. దేశవ్యాప్తంగా ప్రధానమైన 12 పార్టీలకు రూ.258 కోట్ల వరకు విరాళాలు అందగా.. అందులో ఒక్క బీజేపీ కే రూ.212 కోట్లు డొనేషన్లు అందాయి.
మొత్తం విరాళాలలో ఇది 82 శాతం కావడం విశేషం. రెండో స్థానంలో రూ.27 కోట్లతో (10.45 %) జేడీయూ నిలిచింది. ఇక కాంగ్రెస్, ఎన్సీపీ,ఏఐడీఎంకే, డీఎంకే, ఆర్జేడీ, ఆప్, ఎల్ జేపీ,సీపీఎం,సీపీఐలకు కలిపి మొత్తం కలిపి రూ.19 కోట్ల విరాళాలు అందాయి.