ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసి తీరతామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. వ్యవసాయశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. పంట ఉత్పత్తి తగ్గించే తీరుపై తిరోగమన విధాలను అవలంభిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు.
కల్తీ విత్తనాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని.. ఏఈవోలకు నిరంతర ట్రైనింగ్ క్లాసులు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. వ్యవసాయ అధికారులు విస్తృతంగా పర్యటించాలన్నారు. కల్తీ విత్తన విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మరింతగా విస్తరిస్తోందని.. రాష్ట్రంలో మిగిలిన ప్రాజెక్టులు ఏడాదిలో పూర్తవుతాయని కేసీఆర్ అన్నారు.