అర్హులైన లబ్ధిదారులకు దళితబంధు పథకం మరింత వేగంగా చేరేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ పథకం కింద క్షేత్రస్థాయిలో ప్రభుత్వం చేపట్టిన చర్యలను సీఎం కార్యదర్శి రాహుల్బొజ్జా కేసీఆర్కు వివరించారు. రోజుకు 400 మంది చొప్పున ఇప్పటివరకు 25వేల అర్హులైన లబ్ధిదారులకు దళితబంధు అందించామన్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్మాట్లాడుతూ ప్రభుత్వం ముందుగానే దళితబంధు నిధులను విడుదల చేసిందని.. అర్హులను గుర్తించి వాటిని అందివ్వడంలో ఆలస్యం చేయొద్దన్నారు. ఈ స్కీమ్మరింత పక్కాగా అమలయ్యేందుకు త్వరలో జిల్లా కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు కేసీఆర్ తెలిపారు. దళితబంధుతో లబ్ధిదారులకు అనుకున్నదానికంటే ఎక్కువ లబ్ధి చేకూరుతుందని చెప్పారు.