దేశ ప్రజలు అబ్బురపడే ఓ గొప్ప వరాన్ని ప్రధానమంత్రి నరేందర్ మోదీ ప్రకటించారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ తన ట్విట్టర్ సాక్షిగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశంలో 3 కోట్ల పక్కా ఇళ్ల నిర్మాణం పూర్తికానుందని.. ఈ ఇళ్లు ‘మహిళా సాధికారతకు చిహ్నం’ అని ఆయన ట్వీట్ చేశారు.
దేశంలో ఉన్న “పేదలకు పక్కా ఇళ్లు అందించే కార్యక్రమంలో మనం కీలక అడుగు వేశాం. ప్రజా భాగస్వామ్యంతో దేశంలో 3కోట్ల పక్కా ఇళ్ల నిర్మాణం తొందర్లోనే పూర్తి చేయబోతున్నాం. కనీస సౌకర్యాలతో నిర్మితమైన ఈ ఇళ్లు మహిళా సాధికారతకు చిహ్నం” అని మోదీ ట్వీట్ చేశారు.