విశాల్ హీరోగా పాన్ ఇండియా మూవీ ఒకటి తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. రానా ప్రోడక్షన్స్ లో రమణ,నందా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు.విశాల్ హీరోగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ లాఠీ. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ చిత్రీకరణ వేగంగా జరుపుకుంటుంది.
ఈ చిత్రానికి సంబంధించి హీరో యొక్క ఫస్ట్ లుక్ ను చిత్రం యూనిట్ బుధవారం విడుదల చేసింది. ఈ క్రమంలో దర్శకుడు వినోద్ మాట్లాడుతూ సమాజంలో మార్పును తీసుకొచ్చే శక్తి లాఠీకి ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
అన్ని భాషాల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి లాఠీ అని ఒక్క టైటిల్ ను అనుకున్నాం,. యాక్షన్ ప్రధానంగా సాగే చిత్రం ఇది. ప్రస్తుతం స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో పోరాట సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. అని అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ బాల సుబ్రమణ్యన్ , సంగీతం సామ్ సీఎస్.