చైనాలో మళ్లీ కరోనా కలకలం సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నప్పటికీ, చైనాలో మాత్రంలో రోజురోజుకు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఆదివారం ఒక్క రోజే 13 వేల కేసులు నమోదు అయింది.
ఇప్పుడు ఆ సంఖ్య బుధవారానికి దాదాపు 20 వేలకు పైగా చేరింది. ఈ ఒక్కరోజే 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదైనట్లు చైనా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. షాంఘైలోనే అత్యధిక కేసులు నమోదైనట్లు స్పష్టం చేశారు. అయితే, రెండేళ్ల కాలంలో ఇవే గరిష్ట కేసులుగా చైనా ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.