Home / ANDHRAPRADESH / గవర్నర్‌తో సీఎం జగన్‌ భేటీ.. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై చర్చ!

గవర్నర్‌తో సీఎం జగన్‌ భేటీ.. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై చర్చ!

ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. విజయవాడలోని రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో సమావేశమయ్యారు. త్వరలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టనున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన అంశాలపై గవర్నర్‌తో సీఎం చర్చించినట్లు సమాచారం.

రేపు సాయంత్రం కేబినెట్‌ భేటీ జరగనుంది. ఆ సమావేశంలో ఎవరెవరిని మంత్రివర్గం నుంచి తప్పిస్తున్నారనే సమాచారాన్ని మంత్రులకు సీఎం వివరించనున్నారు. సీఎం జగన్‌ నిర్ణయం మేరకు ఈనెల 8న మంత్రులు తమ రాజీనామాలను సమర్పించే అవకాశముంది. ఆ తర్వాత ఈనెల 11న కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించే వీలుంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేబినెట్‌ రీషఫిల్‌పై గవర్నర్‌తో సీఎం జగన్‌ చర్చించినట్లు తెలుస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat