తాను ఉన్నత స్థాయిలో ఉండటానికి కారణమై విద్యాసంస్థకు ఓ పూర్వవిద్యార్థి భారీ విరాళం అందించారు. ఐఐటీ కాన్పూర్లో మెడికల్ కాలేజ్ ఏర్పాటు కోసం ఆ విద్యార్థి ముందుకొచ్చి తన వంతుగా రూ.100కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. ఈ పూర్వ విద్యార్థి ఎవరో కాదు ఇండిగో కో ఫౌండర్ రాకేశ్ గంగ్వాల్.
ఐఐటీ కాన్పూర్ ప్రాంగణంలో స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ఏర్పాటుకు పూర్వవిద్యార్థి, ఇండిగో కో ఫౌండర్ రాకేశ్ గంగ్వాల్ మద్దతు ప్రకటించి రూ.100కోట్ల విరాళం అందజేశారని ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ అభయ్ కరాండికర్ తెలిపారు. రాకేశ్ గంగ్వాల్కు ఈ సందర్భంగా ట్విటర్ వేదికగా కృతజ్ఞతలు చెప్పారు. మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ పూర్తయిన తర్వాత అడ్వైజరీ బోర్డులో రాకేశ్ గంగ్వాల్ సభ్యులుగా చేరతారని కరాండికర్ చెప్పారు.