ప్రస్తుతం భరించలేని ఎండను చూస్తున్న సంగతి విధితమే. గడప దాటి బయటకు వద్దామంటేనే ఆ వేడి తీవ్రతను చూసి భయపడి బయటకు రావడానికే ఆలోచిస్తున్నాము..
ఈ క్రమంలో వేసవిలో కొన్ని పండ్లను తినటం వల్ల శరీరం డీహైడ్రేట్ అవకుండా ఉంటుంది. ఈ సీజన్లో లభించే తాటి ముంజలు తింటే శరీరంలో వేడి తగ్గి చల్లబడుతుంది. కీర దోస తింటే శరీరం డీహైడ్రేట్ కాదు.
90 శాతం నీరే ఉండే పుచ్చకాయ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ద్రాక్ష, సపోటాలో విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వీటిని వేసవిలో తింటే శరీరానికి మంచి పోషణ లభిస్తుంది.