విజయవాడ: ఏపీలోని నిరుద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి సీఎం జగన్ ఆమోదం తెలిపారు. తొలుత జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన పోస్టుల కంటే ఎక్కువ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీకి ప్రభుత్వం అనుమతించింది. దీని ద్వారా గ్రూప్-1లో 110, గ్రూప్-2లో 182 పోస్టులు భర్తీ చేయనున్నారు.
గ్రూప్-1లో డిప్యూటీ కలెక్టర్లు, ఆర్టీవోలు, సీటీవో, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, ఎంపీడీవో, డీఎస్పీ ఇలా.. 19 రకాల కేటగిరీల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రూప్-2లో డిప్యూటీ తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్, మున్సిపల్ కమిషనర్ తదితర 13 రకాల విభాగాల్లో పోస్టులను భర్తీ చేస్తారు.