ప్రభుత్వ రంగ టెలికం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ ఓ సరికొత్త ఆఫర్ ప్రకటించింది.ఇందులో భాగంగా కస్టమర్ రూ.797తో రీచార్జ్ చేసుకుంటే 395రోజుల వ్యాలిడిటీని వినియోగదారులకు అందిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది.
అయితే ఈ ప్లాన్ లో భాగంగా రోజుకు 2GB హైస్పీడ్ డేటా, 100SMSలు 60 రోజుల పాటు లభిస్తాయి. ఆ తర్వాత ఇచ్చే డేటా ఫెయిర్ యూస్ పాలసీ (FUP) ఆధారంగా ఉంటుందని వెల్లడించింది. ఈ ఆఫర్ అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంటుందని పేర్కొంది. అయితే ఈ ఆఫర్ మిగతా నెట్ వర్క్స్ కు గట్టి పోటీ ఇవ్వనుంది.