ఈ నెల ఇరవై తారీఖున నుండి మొదలుకానున్న ఐపీల్ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కొత్త కెప్టెన్ గా సౌతాఫ్రికా ఆటగాడు డుప్లెసిస్ ఎంపికయ్యాడు. బెంగళూరులో జరిగిన Unbox eventలో ఆర్సీబీ ఫ్రాంఛైజీ ఈ ప్రకటన చేసింది. డుప్లెసిస్ సౌతాఫ్రికాకు 115 మ్యాచ్ కెప్టెన్సీ వహించాడు. ఇందులో మొత్తం 81 మ్యాచ్ లు గెలిచింది. ఇది వరకు సారథిగా ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి తప్పుకోవడంతో కొత్త నాయకుడిని ఎన్నుకోవాల్సి వచ్చింది.
