ఏపీ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దంపతులు, వారి కుమారుడు కన్నా నాగరాజుపై ఆయన భార్య శ్రీలక్ష్మి వేసిన గృహ హింస కేసు రుజువైంది. దీంతో ఆమెకు రూ. కోటి పరిహారం ఇవ్వాలని విజయవాడ ఒకటో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశాలిచ్చింది. అలాగే పిటిషనరు, ఆమె కుమార్తెకు ప్రతివాదుల ఇంటిలో నివాస వసతి కల్పించాలని స్పష్టం చేసింది. లేదంటే నెలకు రూ. 50వేలు చెల్లించాలని పేర్కొంది.
