కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తో పాటు ఆ పార్టీకి చెందిన ఇతర నేతల అకౌంట్లను.. ట్విట్టర్ సంస్థ అన్లాక్ చేసింది. ఇటీవల ఢిల్లీలో రేప్, హత్యకు గురైన ఓ తొమ్మిదేళ్ల బాలిక ఫ్యామిలీ ఫోటోను ట్వీట్ చేసిన నేపథ్యంలో రాహుల్తో పాటు ఆ పార్టీ నేతల అకౌంట్లను ట్విట్టర్ సంస్థ తాత్కాలికంగా లాక్ చేసిన విషయం తెలిసిందే.
అయితే శుక్రవారం రాహుల్ .. ట్విట్టర్పై విరుచుకుపడ్డారు. భారతీయ రాజకీయ వ్యవస్థలో జోక్యం చేసుకుని ట్విట్టర్ సంస్థ ప్రమాదకర ఆట ఆడుతున్నట్లు రాహుల్ విమర్శించారు.
ఈ నేపథ్యంలో ఇవాళ ట్విట్టర్ సంస్థ కాంగ్రెస్ పార్టీ అకౌంట్లను తిరిగి అన్లాక్ చేసింది. అయితే అన్లాకింగ్కు సంబంధించి ట్విట్టర్ సంస్థ ఎటువంటి వివరణ ఇవ్వలేదని ఆ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జి రోహన్ గుప్తా తెలిపారు.