దేశంలో ఉధృతి తగ్గడం లేదు. రోజువారీ కేసులు నిన్న భారీగా తగ్గగా.. తాజాగా మళ్లీ పెరిగాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 38,353 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది.
తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3.20కోట్ల మార్క్ను దాటింది. తాజాగా 40,013 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటి వరకు 3,12,20,981 మంది డిశ్చార్జి అయ్యారు. రికవరీ రేటు 97.45శాతానికి చేరుకుందని పేర్కొంది.
వైరస్ బారినపడి కొత్తగా 497 మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పటి వరకు 4,29,179 మంది మృతి చెందారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 3,86,351గా ఉన్నాయని, 140 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయని చెప్పింది.
టీకా డ్రైవ్లో భాగంగా ఇప్పటి వరకు మొత్తం 51.90 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది. వీక్లీ పాజిటివిటీ రేటు 2.34శాతానికి, రోజువారీ 2.16శాతానికి చేరుకుతుందని తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 48.50కోట్ల కొవిడ్ శాంపిల్స్ పరీక్షించినట్లు మంత్రిత్వ శాఖ వివరించింది.