తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మంత్రి కేటీఆర్ గారి జన్మదిన శుభసందర్బంగా బహ్రెయిన్ ఎన్నారై టీఅర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో “ముక్కోటి వృక్షార్చన”. మంత్రి కేటీఆర్ గారి జన్మదిన శుభసందర్బంగా మొక్కలను నాటిన ఎన్నారై టీఅర్ఎస్ సెల్ బహరేన్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బొలిసెట్టి,జనరల్ సెక్రటరీ పుప్పాల బద్రి.
గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారుతలపెట్టిన “ముక్కోటి వృక్షార్చన” గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా తెరాస కార్యనిర్వాహక అధ్యక్షులు , ఐటి మరియు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు గౌరవ. కేటీఆర్ గారి జన్మదిన శుభసందర్బంగా జనహృదయ నేతకు బహరేన్ లో మూడు మొక్కలు నాటడం జరిగింది.
ఈ సందర్భంగా ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బొలిసెట్టి, జనరల్ సెక్రటరీ పుప్పాల బద్రిమాట్లాడుతూ మానవత్వానికి ,సేవకి మారు పేరైన యువ నేత కేటీఆర్ గారు టీఅర్ఎస్ పార్టీని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారు . కెసిఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ కు ఎన్నో వివిధ కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.