Home / SLIDER / సిరిసిల్లలో డబుల్‌ బెడ్రూం ఇండ్లను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

సిరిసిల్లలో డబుల్‌ బెడ్రూం ఇండ్లను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా   తంగళ్లపల్లి మండలం మండేపల్లి వద్ద నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను సీఎం కేసీఆర్‌ ఆదివారం ప్రారంభించారు. అంతకు ముందు రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్‌ నుంచి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి జిల్లాకు వచ్చిన సీఎం కేసీఆర్‌కు అధికారులు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు.

హైదరాబాద్‌ నుంచి మొదట నేరుగా మండేపల్లికి చేరుకున్న సీఎం కేసీఆర్‌ డబుల్‌ బెడ్రూం ఇండ్ల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఆ తర్వాత డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను ప్రారంభించి, లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. ఇంట్లో పూజ కార్యక్రమాల అనంతరం లబ్ధిదారులకు మిఠాయిలు తినిపించారు. కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు పలు శాఖల మంత్రులు నిరంజన్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, స్థానిక నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సిరిసిల్లకు చెందిన పవర్‌ లూం కార్మికులతో పాటు నిరుపేదల కోసం మండేపల్లి వద్ద ప్రభుత్వం 1,320 డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించింది. 26 ఎకరాల విస్తీర్ణంలో జీ ప్లస్‌ టూ పద్ధతిలో.. గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో సకల సదుపాయాలతో నిర్మాణం చేపట్టింది. పిల్లలు, పెద్దలకు ఆహ్లాదాన్ని పంచేలా ఆట వస్తువులతో ఉద్యనవనాలు, ఓపెన్‌ జిమ్‌లు సైతం ఏర్పాటు చేశారు.

డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం 2017లో ప్రారంభం కాగా.. ఏడాది క్రితమే పూర్తయ్యాయి. పారిశుధ్యం, మౌలిక వసతులతోపాటు ఇంటింటికీ మిషన్‌ భగీరథ నీళ్లు అందించే పైపులను ఏర్పాటు చేశారు. ఇండ్లకు అవసరమైన కరెంటు కనెక్షన్లకు సంబంధించి.. తీగలను వేలాడదీయకుండా ప్రధాన స్తంభం నుంచి భూగర్భం ద్వారా నేరుగా బ్లాకులకు కనెక్షన్‌ ఇచ్చారు. ప్రస్తుతం డబుల్‌ బెడ్‌రూంలను సీఎం కేసీఆర్‌ ప్రారంభించడంతో సిరిసిల్ల నేత కార్మిక కుటుంబాలు, నిరుపేదల సొంతింటి కల నెరవేరినట్లయింది

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat