Home / HYDERBAAD / సికింద్రాబాద్ పరిధిలో శరవేగంగా అభివృద్ది పనులు

సికింద్రాబాద్ పరిధిలో శరవేగంగా అభివృద్ది పనులు

సికింద్రాబాద్ పరిధిలో అభివృద్ది పనులు శరవేగంగా సాగుతున్నాయని, సంక్షేమ కార్యకలాపాలు, అభివృధి పనులను నిర్వహిస్తున్నామని ఉప సభాపతి శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. చిలకలగుడా మునిసిపల్ మైదానంలో రూ. 4 4 లక్షల ఖర్చుతో నిర్మించనున్న వాకింగ్ ట్రాక్, గ్రీన్ బెల్టు ఇతరత్రా నిర్మాణం పనులకు శ్రీ పద్మారావు గౌడ్ శనివారం శంఖుస్థాపన చేశారు.

చిలకలగుడా మునిసిపల్ మైదానాన్ని తామే పరిరక్షిస్తామని, ప్రజలకు ఉపకరించేలా తీర్చిదిద్దుతామని శ్రీ పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా అన్నారు. సికింద్రాబాద్ పరిధిలోని అన్ని ప్రభుత్వ స్థలాలను తాము సమర్ధవంతంగా పరిరక్షిస్తున్నామని తెలిపారు.

లాక్ డౌన్ రోజుల్లో కుడా నిత్యం ప్రజలకు అందుబాటులో నిలిచి వివిధ సంక్షేమ పనులను తాము చేపట్టామని అయన అన్నారు. డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి, శ్రీ మెట్టుగుడా కార్పొరేటర్ శ్రీమతి రాసురి సునిత, సితాఫలమండీ కార్పొరేటర్ కుమారి సామల హేమ, తెరాస యువ నేతలు శ్రీ తీగుల్ల కిషోర్ కుమార్, శ్రీ తీగుల్ల రామేశ్వర్ గౌడ్ , అధికారులు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat