తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాల కాంట్రాక్టు లెక్చరర్లకు బేసిక్ పే అమలు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి హరీష్ రావు గారు స్పష్టం చేశారు.
ఇందుకు సంబంధించిన జీవోలు 104, 105, 106 లను కాంట్రాక్ట్ లెక్చరర్ల జేఏసీ నేతలకు మంత్రులు హరీష్ రావు, జగదీశ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలను మంత్రులు అభినందించారు.
బేసిక్ పే జీవో విడుదల చేసినందుకు వారు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం లో సీఎస్ సోమేష్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, తెలంగాణ ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు అధ్యాపకుల జేఏసీ ఛైర్మన్ కనక చంద్రం, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి దరిపల్లి నగేష్ మరియు రాష్ట్ర మహిళా సెక్రెటరీ మాలతి, డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్ల అధ్యక్షులు వినోద్ కుమార్, పాలిటెక్నిక్ కళాశాల అధ్యక్షులు ఉమ శంకర్, రాష్ట్ర నాయకులు సదానందం పాల్గొన్నారు.