పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కరోనాకు పాజిటివ్గా పరీక్ష చేశారు. దీంతో సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండాలని వైద్యులు సూచించారని ఆరోగ్యశాఖ వర్గాలు ధ్రువీకరించాయి.
అలాగే ఆయన భార్య మీరా భట్టాచార్య సైతం వైరస్ బారినపడ్డారు. దీంతో ఆమె మంగళవారం సాయంత్రం నగరంలోని ఓ ఆసుపత్రిలో చేరారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
బుద్ధదేవ్ భట్టాచార్య, ఆయన సతీమణి, వారి సహాయకుడి నుంచి ఉదయం నమూనాలను సేకరించగా.. ఫలితాల్లో పాజిటివ్గా తేలిందని పేర్కొన్నాయి. మీరా భట్టాచార్యకు చికిత్సలు అందించేందుకు మెడికల్ బోర్డు ఏర్పాటు చేశామని.. మాజీ ముఖ్యమంత్రికి ఇంట్లోనే వైద్యులు సేవలందిస్తున్నారని, ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నట్లు వివరించాయి.