తెలంగాణ రాష్ట్రంలో మరో పరిశ్రమ పెట్టడానికి ముందుకొచ్చింది ప్రముఖ పారిశ్రామిక సంస్థ హెచ్ఎస్ఐఎల్ గ్రూప్. ఇందులో భాగంగా రాష్ట్రంలోని భువనగిరిలో రూ.230 కోట్లతో గాజు పరిశ్రమను ఏర్పాటు చేయనున్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ట్విట్టర్లో వెల్లడించారు.
ఈ విషయాన్ని సంస్థ ఎండీ సందీప్ సోమానీ తనకు తెలియజేశారని పేర్కొన్నారు. ఈ పరిశ్రమ ద్వారా 700 ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. హెచ్ఎస్ఎల్ గ్రూప్ రాష్ట్రంలో ఏడోసారి పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నదని వివరించారు.
ఆ యా సంస్థలు మళ్లీ మళ్లీ పెట్టుబడి పెట్టడానికి రావడం.. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు సానుకూలంగా ఉన్నాయనడానికి నిదర్శనమని పేర్కొన్నారు.