దేశంలో కొత్తగా 11,831 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,38,194కు చేరింది. ఇందులో 1,05,34,505 మంది బాధితులు మహమ్మారి బారినుంచి కోలుకోగా, 1,55,080 మంది మరణించారు.
మరో 1,48,609 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, గత 24 గంటల్లో వైరస్ వల్ల 84 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరో 11,904 మంది కోలుకున్నారని తెలిపింది. దీంతో రికవరీ రేటు 97.2 శాతం ఉండగా, మరణాల రేటు 1.4 శాతంగా ఉన్నదని వెల్లడించింది. అదేవిధంగా నిన్నటి వరకు దేశవ్యాప్తంగా 58,12,362 మందికి కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు పేర్కొంది.
దేశవ్యాప్తంగా నిన్నటివరకు 20,19,00,614 నమూనాలకు కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) తెలిపింది. ఆదివారం ఒక్కరోజే 5,32,236 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశామని వెల్లడించింది.