మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం `ఆచార్య`. ఈ సినిమాలో మెగాపవర్స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే చెర్రీ సరసన నటించే హీరోయిన్ను ఇంకా ఫిక్స్ చేయలేదు.
సినిమాలో కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ ఆ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ కియారా ఆడ్వాణీ, టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్నా పేర్లు వినిపించాయి.
తాజాగా మరో కొత్త పేరు తెర మీదకు వచ్చింది. టాలీవుడ్ ప్రముఖ కథానాయిక పూజా హెగ్డే ఈ సినిమాలో చెర్రీ సరసన కనిపించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.