డిసెంబర్లో మెగా ఫ్యామిలీ ఇంట సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. నిహారిక పెళ్ళిలో భాగంగా జరిగిన పలు కార్యక్రమాలకు మెగా ఫ్యామిలీ అంతా ఒకే చోట చేరి సందడి చేసింది. వాటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేశాయి.
ఇక డిసెంబర్ 18న నిహారిక బర్త్డే వేడుకలని కూడా గ్రాండ్గా నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ఫ్రెండ్స్, ఫ్యామిలీ హాజరయ్యారు. ఆ ఫొటోలు కూడా అంతర్జాలంలో హల్ చల్ చేశాయి.
గత రాత్రి రామ్ చరణ్ ఇంట క్రిస్మస్ వేడుకలని ఘనంగా నిర్వహిచంగా ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ అంతా హాజరైంది. సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, నిహారిక, చైతన్య, శిరీష్ ,అల్లు అర్జున్, స్నేహా రెడ్డి, సుస్మిత, శ్రీజ, కళ్యాణ్ దేవ్ తదితరులు ఈ పార్టీలో సందడి చేయగా,అందుకు సంబంధించిన ఫొటోని శిరీష్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా కజిన్స్తో సీక్రెట్ శాంటా ఆడామని అన్నాడు. అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చినందుకు చరణ్ & ఉపాసనకు ధన్యవాదాలు తెలిపారు.