గడిచిన 24గంటల్లో దేశంలో 25,153 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య కోటి మార్క్ను దాటింది. అమెరికా తర్వాత కోటి కరోనా వైరస్ కేసులను దాటిన రెండో దేశంగా భారత్ నిలిచింది. జనవరి 30న కేరళలో తొలికేసు నమోదైన నుంచి ఇప్పటి నుంచి 95.5లక్షల మంది కోలుకున్నారు. తాజాగా 347 మంది వైరస్కు బలవగా.. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,45,136కు పెరిగింది. తాజాగా 29,885 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 95,50,712 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.
ప్రస్తుతం 3,08,751 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 95.46శాతంగా ఉందని, మరణాల రేటు 1.45శాతంగా ఉందని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా మహమ్మారి నుంచి 16కోట్లకుపైగా కరోనా నమూనాలను పరిశీలించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. శుక్రవారం ఒకే రోజు 11,71,868 శాంపిల్స్ పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. ఇప్పటి వరకు 16,00,90,154 నమూనాలను పరీక్షించినట్లు వివరించింది.గడిచిన 24గంటల్లో దేశంలో దేశంలో 25,153 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య కోటి మార్క్ను దాటింది. అమెరికా తర్వాత కోటి కరోనా వైరస్ కేసులను దాటిన రెండో దేశంగా భారత్ నిలిచింది. జనవరి 30న కేరళలో తొలికేసు నమోదైన నుంచి ఇప్పటి నుంచి 95.5లక్షల మంది కోలుకున్నారు. తాజాగా 347 మంది వైరస్కు బలవగా.. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,45,136కు పెరిగింది. తాజాగా 29,885 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 95,50,712 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.
ప్రస్తుతం 3,08,751 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 95.46శాతంగా ఉందని, మరణాల రేటు 1.45శాతంగా ఉందని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా మహమ్మారి నుంచి 16కోట్లకుపైగా కరోనా నమూనాలను పరిశీలించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. శుక్రవారం ఒకే రోజు 11,71,868 శాంపిల్స్ పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. ఇప్పటి వరకు 16,00,90,154 నమూనాలను పరీక్షించినట్లు వివరించింది.