అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఇటీవలె `లవ్స్టోరీ` చిత్ర షూటింగ్ను పూర్తి చేశాడు.
ఈ సినిమా విడుదలవకముందే మరో సినిమాను పట్టాలెక్కించనున్నాడు. `మనం` సినిమా దర్శకుడు విక్రమ్ కుమార్తో మరోసారి కలిసి పనిచేయబోతున్నాడు.
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి `థాంక్యూ` అనే టిటైల్ ఖరారు చేశారు. పీసీ శ్రీరామ్ ఛాయాగ్రాహకుడు. ఈ సినిమాలో చైతన్య సరసన ముగ్గురు కథానాయికలు కనిపించనున్నారట.
ప్రస్తుతం వారి ఎంపిక ప్రక్రియ జరుగుతోందట. దసరా సందర్భంగా ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోందట.