Home / SLIDER / తెలంగాణ భవన్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

తెలంగాణ భవన్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

సిద్దిపేట జిల్లా పొన్నాల శివారులోని నిర్మించిన టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం ప్రారంభించారు. అనంతరం భవనాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కాగా, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయిదాకా బలమైన పునాదులు వేసుకున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులకు సరైన దిశానిర్దేశం చేసేందుకు అన్ని జిల్లా కేంద్రాల్లో తెలంగాణ భవన్‌లను నిర్మించారు.

రాష్ట్రంలోనే మొట్టమొదటి టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయ భవనాన్ని సిద్దిపేటలో సీఎం ప్రారంభించారు. ఆయన వెంట మంత్రి హరీశ్‌రావు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. అనంతరం సీఎం అక్కడి నుంచి మిట్టపల్లికి బయలుదేరి వెళ్లారు. అక్కడ రైతు వేదికను ప్రారంభించనున్నారు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat