కార్గో సేవలను ప్రారంభించిన తెలంగాణ ఆర్టీసీ.. నేటి మరో ముదండగు వేయనుంది. ప్రయోగాత్మకంగా గురువారం నుంచి ఇంటికే పార్శిళ్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఖైరతాబాద్లో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
సుమారు మూడు నెలల పాటు ప్రయోగాత్మకంగా సేవలు అందించనున్నారు. విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు. డోర్ టూ డోర్ సేవల కోసం మూడు సంస్థలను ఇప్పటికే అధికారులు ఎంపిక చేశారు.
నగరాన్ని మూడు సెక్టార్లుగా విభజించి ఆయా సంస్థలకు అప్పగించింది. ఇక నుంచి నేరుగా వినియోగదారుడి ఇంటికే ఆర్టీసీ పార్శిల్ కార్గో సేవలు అందనున్నాయి. డెర్ డెలివరీ సేవలతో ఆర్టీసీ రోజుకు మరో రూ.13లక్షల ఆదాయం వస్తుందని అంచనా. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గంగా పార్శిల్ కార్గో సేవలను ఆర్టీసీ ప్రారంభించిన విషయం తెలిసిందే. తక్కువ కాలంలోనే రోజువారీ ఆదాయాన్ని ఆర్టీసీ వృద్ధి చేసుకుంటూ వస్తోంది.