ప్రస్తుతం టాలీవుడ్లో పూజా హెగ్డే అత్యంత బిజీ హీరోయిన్. అగ్ర హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్గా వెలుగొందుతోంది. పూజ ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ `రాధేశ్యామ్`లో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం ఇటలీ వెళ్లింది.తాజాగా అక్కడి నుంచి భారత్కు వచ్చేసింది. తాజాగా ముంబై ఎయిర్పోర్ట్లో దర్శనమిచ్చింది.
`రాధేశ్యామ్`కి సంబంధించి ఇటలీ షెడ్యూల్ షూటింగ్ను పూజ పూర్తి చేసినట్టు సమాచారం. అందుకే పూజ భారత్కు తిరిగి పయనమైంది. `రాధేశ్యామ్`తోపాటు అక్కినేని అఖిల్ `మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్`లో కూడా పూజ హీరోయిన్గా నటిస్తోంది.