బీజేపీ పార్టీ వందతుల పుట్ట, అబద్ధాల గుట్ట. దివాలాకోరు మాటలతో ప్రజల విశ్వాసాన్ని కోల్పోతోంది. అందుకే ఏళ్ల తరబడి ఆ పార్టీలో ఉన్నవారంతా విశ్వసనీయత కలిగిన టీఆర్ఎస్ వైపు వస్తున్నారు. ఆ పార్టీ కమిటీలన్నీ కారెక్కుతున్నాయి’’ అని మంత్రి హరీశ్రావు వ్యాఖ్యానించారు.
దౌల్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందుప్రియాల్, షాపూర్, బందారం, నర్సంపేట, శేరుపల్లి, లింగాయ్పల్లి గ్రామాలకు చెందిన బీజేపీ నేతలు టీఆర్ఎ్సలో చేరగా.. హరీశ్రావు వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ అబద్ధాలను నిజాలుగా.. నిజాలను అబద్ధాలుగా.. మార్చి గోబెల్స్ ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలకు నోబెల్ బహుమతి ఇచ్చినా తక్కువేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో మోటార్లు కాలిపోయేవని.. ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయేవని, ఇప్పుడేమో బాయి కాడ మోటార్లు పెడుతూ బీజేపీ మరోసారి వంచిస్తోందని ఆరోపించారు.
కాలిపోయే మోటార్లు కావాలో… బాయికాడ మీటర్లు కావాలో.. ఉచిత కరెంటు ఇచ్చి కడుపు నిండా సంక్షేమాన్ని అందిస్తున్న టీఆర్ఎస్ కావా లో ప్రజలే నిర్ణయించుకుంటారన్నారు.